Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ.. ఎందుకో తెలిస్తే విస్తుపోతారు! - వైన్ షాపులు యధాతథం!

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్నారు. ఈ కర్ఫ్యూ ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అమల్లో ఉండనుంది. కర్ఫ్యూ ఉన్న కాలంలో అన్ని రకాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇప్పటికే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్...  రెండో దశ వ్యాప్తి త్వరలోనే ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఐదు రోజుల పాటు కర్ఫ్యూను విధిస్తూ, నూతన సంవత్సర వేడుకలు రద్దు చేసింది. 
 
ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా, కొత్త సంవత్సరాది నేపథ్యంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు.
 
అయితే, రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా గడచిన 24 గంటల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు వందల మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 500 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 77, పశ్చిమ గోదావరి జిల్లాలో 63, గుంటూరు జిల్లాలో 55 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
 
అదేసమయంలో 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,660 మందికి చికిత్స కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments