Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కరోనా కలకలం.. ఒకే రోజు ఐదు అనుమానిత కేసుల నమోదు

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:39 IST)
విశాఖలో కరోనా వైరస్ కేసుల కలకలం రేపుతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

వీరంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే. ఓ కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమార్తె కొద్ది కాలం కిందట కౌలాలంపూర్ వెళ్లి, రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వీరు బాధ పడుతున్నట్టు గుర్తించిన విమానాశ్రయ అధికారులు.. వారిని వెంటనే నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ వార్డుకు తరలించారు. 
 
మరోవైపు, గత నెల 28న బహ్రెయిన్ నుంచి విశాఖకు వచ్చిన 23 ఏళ్ల ఓ యువతి, ఆమె స్నేహితుడు కూడా గత రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు.

దీంతో, వీరిని కూడా కరోనా వార్డులో చేర్చారు. వీరి ముక్కు, గొంతు నుంచి తీసుకున్న నమూనాలను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు పంపించారు. రెండు రోజుల్లో వీరి రిపోర్టులు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments