Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా ఉధృతి.. 88కి చేరిన మృతుల సంఖ్య.. 264మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (11:06 IST)
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,720కి చేరింది. మంగళవారం చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 88మందికి పాజిటివ్‌ అని తేలింది. కృష్ణాజిల్లాలో మరో 42మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1022కి చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మరో 41కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాలో 28మందికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 56చొప్పున, తూర్పుగోదావరిలో 16, నెల్లూరులో 5కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదయ్యాయని 380మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 9,900 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 8వ స్థానానికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments