Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. ఏపీలో 1398, తెలంగాణలో 1078 కేసులు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:08 IST)
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1398 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9లక్షల 5వేల 946కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది మృత్యువాత పడడంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7 వేల 234 కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 89వేల 295గా ఉండగా ప్రస్తుతం 9వేల 417 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.
 
ఇక తెలంగాణలో తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. ఇందులో 3,02,207 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 6,900 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments