Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి ఆగమనం... చిరు జల్లులు పడే ఛాన్స్

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాం ఉంది. శ్రీహరికోట సమీప ప్రాంతాలపై ఈ రుతుపవనాలు విస్తరించినవున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. ఈ ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఏపీలోని శ్రీహరికోటతోపాటు కర్నాటక, తమిళనాడు, ధర్మపురి, శివమొగ్గ, రత్నగిరి, హాసన్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అనువైన పరిస్థితులు ఉన్నట్టు తెలిపారు. రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైుపు, ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments