Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో కలిసి కుట్రలు: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై ఏపీ హోంమంత్రి ఫైర్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

ఈ నెల 13 న ఓ హోటల్ లో ఒకరి తరవాత ఒకరు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలవాల్సిన అవసరం ఏముందన్నారు.

స్థానిక సంస్థలు ఎన్నికల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రవర్తించాడని గుర్తుచేశారు. ఇప్పడు బీజేపీ నాయకులతో సమావేశమై ఎటువంటి కుట్రలకు సన్నాహాలు చేస్తున్నారో అనే అనుమానం కలుగుతోందన్నారు.

గతంలో కూడా టీడీపీ ఇటువంటి హోటల్ సమావేశాలు, రాజకీయ కుట్రలు చేయడం మనం చూసామన్నారు. బీజేపీ లో పదవి ఉన్నప్పటికీ..టీడీపీ కోసం పనిచేస్తున్న సుజనా, కామినేనిలపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్యంగా హోటల్ లో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments