Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
 
ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఈ అధ్యయన కమిటీ వచ్చే ఏడాది మార్చి31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
 
దీంతో ప్రభుత్వం 13 జిల్లాలను పునవ్యవస్థీకరించి 25 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాల్లో అంతర్భాగమై ఉన్నది. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఛీప్ సెక్రటరీ ముఖ్యమంత్రికి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments