Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
 
ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఈ అధ్యయన కమిటీ వచ్చే ఏడాది మార్చి31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
 
దీంతో ప్రభుత్వం 13 జిల్లాలను పునవ్యవస్థీకరించి 25 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాల్లో అంతర్భాగమై ఉన్నది. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఛీప్ సెక్రటరీ ముఖ్యమంత్రికి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments