Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మొత్తం 80మంది, ధ్యావుడా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (21:54 IST)
తిరుమలలో నూతనంగా ప్రభుత్వం నియమించిన జంబో పాలకమండలిపై సర్వత్రా విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు 24 మంది అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 56 మందిని ప్రభుత్వం నియమించింది.
 
నామినేటెడ్ పోస్టులు దొరకని వారందరికీ తిరుమలను పునరావాస కేంద్రంగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, స్థానిక బిజెపి నేతలు మండిపడుతున్నారు. పూర్తిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈరోజు ఏకంగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. పాలకమండలి సభ్యుల నియామకం సరైంది కాదన్నారు. అయితే ప్రభుత్వం నియమించిన సభ్యులు మాత్రం ఒక్కొక్కరు.. ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం విమర్సలను పట్టించుకోకుండా జంబో పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం విమర్సలకు తావిస్తోంది.
 
ఇప్పటికే సుమారుగా 15 మందికి పైగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన వారు ప్రతిరోజు ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ లెక్కన 80 మంది సభ్యులకు 80 మంది అటెండర్లు, 80 ఆఫీసులు, 80 టిటిడి కార్లు.. 80 మందికి ప్రతిరోజు ప్రత్యేక ప్రవేశా దర్సనా టిక్కెట్ల కేటాయింపు.
 
ఇలా ఈ సభ్యులకు టిక్కెట్లన్నీ ఇచ్చేస్తే ఇక సాధారణ భక్తుల పరిస్థితి ఏంటని టిటిడి ప్రశ్నిస్తోంది. ఇన్ని విమర్సలు వస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా విమర్సలను పూర్తిగా పక్కనబెట్టేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments