Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై జయరామ్ అనుమానాస్పద మృతి.. ఈయనే కోస్టల్ బ్యాంకు ఫౌండర్

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:37 IST)
ఎన్నారై జయరామ్‌గా, కోస్టల్ బ్యాంకు ఛైర్మన్‌గా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కీసరకు సమీపంలో ఐతవరం గ్రామ జాతీయరహదారి పక్కన ముళ్ళ పొదల్లో ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివశిస్తున్నారు. కోస్టల్ బ్యాంకు డైరెక్టర్‌గా, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా జయరామ్ పనిచేస్తున్నారు. జయరామ్ కొన్ని రోజులు ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్‌గా పని చేయగా, ఈ టీవీని ఒక యేడాది క్రితం మూసివేశారు. జయరామ్ కుటుంబం అమెరికాలో నివాసం ఉంటుంది. హత్యకు ఆర్థికపరమైన వివాదాలు కారణమై ఉంటాయని పోలీసుల అనుమానిస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం జయరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో మరో వ్యక్తితో కలిసి వెళ్లినట్లు తెలిసింది. అయితే, తలపై బలమైన గాయాలు ఉండటంతో ఆయన్ను కొట్టి చంపారా లేదా ప్రమాదవశాత్తు చనిపోయారా అన్నది తెలియాల్సి వుంది. కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కనూరులో జయరామ్ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఈయనకో అమెరికాతో పాటు.. హైదరాబాద్‌లో పలు కంపెనీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments