నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. సూర్యతాపం కారణంగా పగటి పూటేకాకుండా రాత్రి సమయాల్లో కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తల్లడిల్లిపోతున్నారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎండ, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీనికితోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలోని 433 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 
 
రానున్న రెండు రోజులు కోస్తాలో వడకాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీ వరకు కోస్తాలో ఎండలు కొనసాగుతాయని వాతావణ శాఖ తెలిపింది. అయితే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments