Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. సూర్యతాపం కారణంగా పగటి పూటేకాకుండా రాత్రి సమయాల్లో కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తల్లడిల్లిపోతున్నారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎండ, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీనికితోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలోని 433 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 
 
రానున్న రెండు రోజులు కోస్తాలో వడకాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీ వరకు కోస్తాలో ఎండలు కొనసాగుతాయని వాతావణ శాఖ తెలిపింది. అయితే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments