Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురి యువకుల ప్రాణాలు తీసిన బొగ్గులకుంపటి

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:36 IST)
మేడ్చల్ జిల్లాలో ఓ బొగ్గుల కుంపటి నలుగురి ప్రాణాలు తీసింది. వెచ్చదనం కోసం వెలిగించిన ఈ కుంపటి కారణంగా చివరకు నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం బొమ్రాస్‌పేట గ్రామశివారులో ఉన్న ఓ కోళ్ళఫారంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. యువకులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో బొగ్గుల కుంపటి వల్లే నలుగురు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. రాత్రి కోళ్లకు టీకాలు వేసిన తర్వాత నలుగురు యువకులు మద్యం సేవించారు. గదిలోకి వెళ్లిన తర్వాత వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసివేయడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments