Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూటిగా సుత్తిలేకుండా సీఎం జగన్ సమీక్షలు... అధికారులకు ఇంట్లోనే భోజనాలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (10:22 IST)
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్త సీఎం రివ్యూలు సూటిగా సుత్తి లేకుండా జరుగుతున్నాయని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
 
సోమవారం హెల్త్, ఇరిగేషన్ పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖలో 104, 108 వాహనాల పనితీరుపై ఆరా తీశారు. అధికారులు ఏదో సమాధానం చెబుతుండగా ఎన్ని ఉన్నాయో కాదు... ఎన్ని పని చేస్తున్నాయో చెప్పాలంటూ జగన్ అధికారులకు చురకలు అంటించారు.
 
వైజాగ్ మెడ్ టెక్ విస్తరణ పనులు గురించి పూనమ్ మాలకొండయ్యతో మాట్లాడుతూ... ఇదేనా లగడపాటిది అంటూ సెటైర్ వేశారు. పోలవరం గురించి ప్రస్తావిస్తూ డాష్ బోర్డ్ లెక్కలు నాకు చెప్పొద్దని, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో వాస్తవం చెప్పమని అధికారులు క్లాస్ పీకారు. పోలవరంలో టెండర్ల విషయంలో అక్రమాలు చెప్పిన అధికారులను సన్మానిస్తాననీ, 
వాస్తవాలు చెపితే సమస్యల పరిష్కారం తాను తీసుకుంటానన్నారు జగన్. 

సుదీర్ఘ చర్చలు లేకుండా సాగుతున్న కొత్త ముఖ్యమంత్రి సమీక్షలకు అధికారులు కూడా ఖుషీ అవుతున్నారు. సమీక్షలతో పాటు జగన్ ఇంట్లోనే అధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆనందపడుతున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments