Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ - తీరు మార్చుకోకుంటే కొత్తవారికి ఛాన్స్...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:38 IST)
వైకాపాకు చెందిన శాసనసభ్యులకు శుక్రవారం వర్క్ షాపు నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వర్క్ షాపుకు ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహించారు. ఇందులో ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఇందులో 32 మంది ఎమ్మెల్యేలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ హెచ్చరించారు. 
 
ముఖ్యంగా వచ్చే 100 రోజులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో పాటు పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, పని తీరును మార్చుకోని పక్షంలో వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. పైగా, కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతానని చెప్పారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఎవరినీ మార్చే ఉద్దేశ్యం తనకు లేదనీ, కానీ ఆ పరిస్థితిని మీరే తెచ్చుకోవద్దని కోరారు.
 
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పది రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments