Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (15:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభోత్సవం కోసం ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ కొత్త యూనిట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత నేలటూరు వేదికగా జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. 
 
జిల్లాలోని ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో ప్రాజెక్టు 800 మెగావాట్‌ల సామర్థ్యంతో మూడో యూనిట్‌ను నెలకొల్పింది. దీన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన నెల్లూరు పర్యటనకు రానుండగా, ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 
 
ఈ పర్యటనలో భాగంగా 27వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.55 గంటలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 
 
ఉదయం 11.10 గంటలకు నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ఆయన నేలటూరు గ్రామంలోనే ఉంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు, ఎస్పీ తదితరులు పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments