Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి అమోఘం.. కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలం

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (15:20 IST)
తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా ప్రగతి పథకంలో దూసుకెళ్లిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తద్వారా నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని తెలిపారు. 
 
సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్ని నేడు పునరుత్తేజం పొందాయన్నారు సీఎం. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండదండలు కల్పిస్తున్నాయన్నారు. సమయం వృథా చేయకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. 
 
ఏపీ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో సంపూర్ణంగా నిమగ్నమైందని ఇటీవల పార్లమెంట్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రస్తావించారని కేసీఆర్ గుర్తు చేశారు. 
 
ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్థానం జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదన్నారు. 
 
ఇప్పటికే రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments