Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతల బూతులకు ఇది రియాక్షన్ : వైకాపా నేతల దాడులపై సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు, శ్రేణులు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. ఈ విష సంస్కృతి గత రెండున్నరేళ్ళ కాలంలో ఏపీలో హెచ్చుమీరిపోయింది. ముఖ్యంగా, మంగళవారం ఈ సంస్కృతి మరింతగా పెట్రేగిపోయింది. ఈ దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు జరిపిన దాడులపై ఏపీ సీఎం జగన్ బుధవారం స్పందించారు. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
 
ఈ బూతులను జీర్ణించుకోలేని నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్‌ చూపించారని.. దాని ప్రభావం రాష్ట్రంలో కనబడిందని.. కానీ, రెచ్చగొట్టి, వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.
 
ఇక, మీ చల్లని దీవెనలతో రెండేళ్లు పాలన అద్భుతంగా సాగిందన్నారు. ఇదేసమయంలో కొంతమంది కావాలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments