Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వర్క్‌షాపు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (08:27 IST)
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఇది ఈ నెల 16 లేదా 17 తేదీల్లో జరుగనుంది. ఇందులో వచ్చే ఎన్నికలపై ఫోకస్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వీలుగా ఈ వర్క్‌షాపును నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాపుకు సంబంధించిన వివరాలను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 
 
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై వైకాపా శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ వర్క్ షాపును ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పార్టీలోని వివిధ స్థాయిలో ఉన్న నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
 
పార్టీలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో నడుచుకుంటే గత ఎన్నికల మాదిరిగానే వైకాపా మరోమారు ప్రభంజనం సృష్టించడం ఖాయమని బొత్స అభిప్రాయపడ్డారు. అదేసమయంలో పార్టీ నేతలు తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments