Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోడేళ్లు గుమికూడుతున్నాయ్... మీ బిడ్డ సింహంలా ఒంటరిగా వస్తున్నాడు... సీఎం జగన్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (16:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపా మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. దీనిపై ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు క్లారిటీ ఇచ్చారు. 
 
పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదుడో వాదోడు పథకం కింద అర్హులైన లబ్దిదారులకు నగదు పింపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ  సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, తాను ఎవరినీ నమ్మనని, తనకు పొత్తులు లేవని స్పష్టం చేశారు. దేవుడి దయ, అందరి దీవెనలే తన ఆస్తి అని అన్నారు. 
 
తోడేళ్లు ఒకే చోట గుమిగూడుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒంటరిగా ఎదురు చూస్తున్నా.. ఇంకా ఎలాంటి భయం కనబరచకుండా.. రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగడమే ఇందుకు కారణమని జగన్ వ్యాఖ్యానించారు.
 
వచ్చే ఎన్నికల్లో మరోమారు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. తనకు మేలు చేసేలా మరిన్ని అవకాశాలు కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా అని జగన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments