'స్థానికం' కింద తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:58 IST)
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ కోటా కింద నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా, ఒక స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ స్థానాలకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. 
 
బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే కోటా కింద యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, బీటీ నాయుడు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడుని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 
 
అలాగే, గవర్నర్‌ కోటాలో శివనాథ్‌ రెడ్డి, శమంతకమణి పేర్లు, విశాఖ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా బుద్ధా నాగ జగదీశ్వర్‌రావు పేరును ఖరారు చేశారు. ఈ అభ్యర్థులంతా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏడు ఎమ్మెల్సీ పదవులకుగాను నాలుగు స్థానాలను బీసీలకే కేటాయించారు. రెండు స్థానాలు అగ్రవర్ణాలకు చెందిన వారికి దక్కగా కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారికి అవకాశం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments