Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ధురాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్లో కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ క్లీన్ ఇండియా

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:39 IST)
ఎవ‌రికీ ప‌ట్ట‌ని ప్రాంతాలుగా రైల్వే స్టేష‌న్లు మారిపోతున్న త‌రుణంలో యువ‌త న‌డుం బిగించింది. రైల్వే స్టేష‌న్ లో ప‌ట్టాల‌పై చెత్త చెదారాన్నిక్లీన్ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజయవాడ మదురానగర్ రైల్వే స్టేషన్ లో  క్లీన్ ఇండియా నిర్వ‌హించారు. కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ స్కై బీమాల వినోద్ కుమార్ ఆద్వర్యంలో, వాయుపుత్ర యూత్ క్లబ్, కొమరపురి గొపాల్  వెంకి యూత్ క్లబ్, అభినేష్ లను కలుపుకొని క్లీన్ ఇండియా చేప‌ట్టారు. 
 
ప్లాస్టిక్ నిర్మూలనలో భాగాంగా 450 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పొగు చేశారు. వాటిని రైల్వే స్టేషన్ గార్బేజ్ ఏరియాలో డంప్ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ  కేంద్రం విజయవాడ  యూత్ ఆఫీసర్ సుంకర రాము, పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ట్రాక్స్ ని పరిశుభ్రంగా ఉంచి. రైల్ వే పరిశుభ్రతను  కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రైల్వే స్టేషన్ మాస్టార్ మరియదాస్ ఎంతగానో సహకరించి సిబ్బందిని ఇన్వాల్మెంట్ అయ్యేలా చేశారు. నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు గోపాల్, అభినేష్, మల్లీశ్వరి, హరిజనవాడ యూత్ క్లబ్ , యమ్ శివ, కె కృష్ణ   స్టేషన్ హౌస్ కీపింగ్ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments