నంద్యాలలో క్లాష్... టీడీపీ నేత కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడ

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (14:56 IST)
నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. 
 
నంద్యాల వైసీపీ కౌన్సిలర్ చింపింగ్ బాషా చనిపోవడంతో, గురువారం అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై తిరిగి వస్తుండగా, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనం వారికి అడ్డు వచ్చింది. వాహనాన్ని పక్కకు తీయాలని శిల్పా వర్గానికి చెందినవారు కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. 
 
ఈ క్రమంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నవారిని చెదరగొట్టేందుకు అభిరుచి మధు ప్రైవేట్ గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఉద్రిక్త పరిస్థితి గురించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అలాగే, శిల్పా చక్రపాణిరెడ్డిని, అభిరుచి మధును వేర్వేరు మార్గాల్లో అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. గాల్లోకి కాల్పులు జరిపిన మధు గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments