Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో క్లాష్... టీడీపీ నేత కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడ

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (14:56 IST)
నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ గురువారం నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. 
 
నంద్యాల వైసీపీ కౌన్సిలర్ చింపింగ్ బాషా చనిపోవడంతో, గురువారం అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై తిరిగి వస్తుండగా, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనం వారికి అడ్డు వచ్చింది. వాహనాన్ని పక్కకు తీయాలని శిల్పా వర్గానికి చెందినవారు కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. 
 
ఈ క్రమంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నవారిని చెదరగొట్టేందుకు అభిరుచి మధు ప్రైవేట్ గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఉద్రిక్త పరిస్థితి గురించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అలాగే, శిల్పా చక్రపాణిరెడ్డిని, అభిరుచి మధును వేర్వేరు మార్గాల్లో అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. గాల్లోకి కాల్పులు జరిపిన మధు గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments