Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్ల‌కు అప్ప‌గించిన హైకోర్ట్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:34 IST)
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని సూచించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివాదం న‌డుస్తోంది. సినిమా టిక్కెట్లు ధ‌ర‌లు ఎలా ప‌డితే, అలా పెంచ‌కూడ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం జీవో 35 తీసుకొచ్చింది. దీనిపై ఎగ్జిబిట‌ర్లు హైకోర్టుకు వెళ్ళారు. కాగా, సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్‌ జడ్జి రద్దు చేశారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా, కోర్టు ఈ తాజా ఆదేశాలిచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను సంబంధిత జాయింట్ క‌లెక్ట‌ర్లు నియంత్రిస్తార‌ని, తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments