Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల అధ్వాన్నస్థితిని ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పల్లెవెలుగు బస్సుపడిపోయిన ప్రమాదంలో 10 మంది సజీవంగా జలసమాధి అయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలధాటికి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దీన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసిం కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటలు బస్సు మొత్తం అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రయాణికుల సామాగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదైపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments