Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల అధ్వాన్నస్థితిని ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో పల్లెవెలుగు బస్సుపడిపోయిన ప్రమాదంలో 10 మంది సజీవంగా జలసమాధి అయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలధాటికి ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దీన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసిం కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటలు బస్సు మొత్తం అంటుకుని బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రయాణికుల సామాగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదైపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments