Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి రాజ్ భవన్ లో క్రిస్మస్ వేడుకలు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:23 IST)
విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్ లో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకను సూచిస్తుందని,  ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఆనందం, భక్తితో జరుపుకుంటారన్నారు.
 
యేసుక్రీస్తు జననం ఎంతో ప్రాముఖ్యత సంతరించు కుందని, ఆరోజు ప్రపంచ ప్రజలను వారి పాపాల నుండి విముక్తి కల్పించటానికి దేవుడు తన కుమారుడిని భూమిపైకి పంపించాడని నమ్ముతారన్నారు. తన సిలువ, తదుపరి పునరుత్థానం ద్వారా దేవుడు మానవులకు మోక్షాన్ని,  నిత్యజీవనాన్ని ఇచ్చా డన్నారు.

క్రిస్మస్ అనేది ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ యొక్క అనుబంధాలను గురించి బోధించడానికి సంతోషకరమైన జ్ఞాపకమని, యేసుక్రీస్తు జీవితం సద్గుణ జీవితాన్ని గడపడానికి మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

సిఎస్‌ఐ ఆల్ సెయింట్స్ చర్చికి చెందిన బిషప్ జార్జ్ కార్నెలియస్ తదితరులు ప్రార్థనలు చేసి గవర్నర్‌కు ఆ శీస్సులు  అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments