Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (11:24 IST)
అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. ఈయన గత 1998లో డీఎస్సీ పరీక్ష రాశారు. అప్పటి నుంచి ఈ ఫలితాలను వెల్లడించలేదు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1998 బ్యాచ్ డీఎస్సీ అభ్యర్థులకు పోస్టులు టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అనేక మంది అభ్యర్థులకు రిటైర్మెంట్ వయసు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయపోస్టులు వచ్చాయి. అలాంటి వారిలో కరణం ధర్మశ్రీ ఒకరు. 
 
తాను టీచర్‌గా ఎంపికకావడంతో ధర్మశ్రీ స్పందిస్తూ, డీఎస్సీ రాసినపుడు తన వయస్సు 30 యేళ్లు అని గుర్తు చేశారు. తమిళనాడులోని అన్నామలై యూనివర్శిటీలో బీఈడీ పూర్తి చేసినట్టు చెప్పారు. ఉపాధ్యాయుడుగా స్థిరపడాలని భావించానని, కానీ, 1998 డీఎస్సీ వివాదాల్లో చిక్కుకోవడంతో బీఎల్ పూర్తి చేసినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా యువజన విభాగంలో పని చేసినట్టు తెలిపారు. అపుడు కనుక తనకు ఉద్యోగం వచ్చివుంటే ఉపాధ్యాయుడుగా స్థిరపడివుండేవాడినని చెప్పారు. ఇప్పటికైనా 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments