Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : పేర్ని నాని

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:01 IST)
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పెద్దన్నయ్య చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన్ను తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు కలిశారు. 
 
ఈ సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడుకి, తమకు సంబంధం లేదని చెప్పడానికే తన వద్దకు నిర్మాతలు వచ్చారన్నారు. పైగా, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు చిత్రపరిశ్రమకు సంబంధం లేదన్నారు. 
 
అలాగే, పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కిరాయికి పని చేసేది ఎవరో అందరికీ తెలుసని... జనసేన ఒక కిరాయి పార్టీ అంటూ విమర్శించారు. 
 
రాజకీయ పార్టీని పవన్ కల్యాణ్ ఒక టెంట్ హౌస్‌లా అద్దెకు ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌కు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందని చెప్పారు. సినిమా టికెట్లపై నిర్దిష్టమైన విధానం అవసరమని మంత్రి పేర్ని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments