Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ముందు బోరున విలపించిన అయ్యన్నపాత్రుడు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:24 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా వైపు మొగ్గు చూపడాన్ని టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిని తలచుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ కంటతడిపెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టడం. 
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులంతా హజరయ్యారు. 
 
ఈ సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేక పోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది. ఆయన్ను పార్టీ అధినేతతో పాటు.. ఇతర సభ్యులు ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments