Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ముందు బోరున విలపించిన అయ్యన్నపాత్రుడు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:24 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా వైపు మొగ్గు చూపడాన్ని టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిని తలచుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ కంటతడిపెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టడం. 
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులంతా హజరయ్యారు. 
 
ఈ సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేక పోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది. ఆయన్ను పార్టీ అధినేతతో పాటు.. ఇతర సభ్యులు ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments