Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (16:34 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో చికెన్ ధర రూ.300గా ఉంది. బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.320గా ఉండతో స్కిన్‌తో అయితే, ఈ ధర రూ.260గా వుంది. ఇక నాటు కోడి ధరలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు కోడి కేజీ చికెన్ ధర రూ.500గా వుంది. విజయవాడలో అయితే, కోడి మాంసం ధర రూ.850గా వుంది. 
 
ఈ యేడాది ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.200 నుంచి రూ.230 వరకు పలికింది. ఆ తర్వాత రికార్డు స్థాయిలో ఈ ధర రూ.280కు చేరింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ మే ఒకటో తేదీ నాటికి రూ.228కు చేరింది. 
 
కానీ, కరోనా మహమ్మారి సమయంలో వీటి ధరలు అమాంతం దిగివచ్చాయి. కిలో చికెన్ వంద రూపాయల కంటే తక్కువకు పడిపోయాయి. కానీ, కరోనా సెకండ్ వేవ్ తర్వాత వీటి ధరలు ఒక్కసారిగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 
 
ఇపుడు వేసవి సీజన్‌కి డిమాండ్ మరింత పెరిగిపోవడం, డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో వీటి ధరలు అమాంత్ పెరిగనట్టు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా కోళ్లు వేసవిలో బరువు పెరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సరఫరా తగ్గిపోయిందని అంటున్నారు. చికెన్ ధరలు పెరగడానికి కోళ్ళ దానా కూడా విపరీతంగా పెరిగిపోవడం మరో కారణంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments