Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై మహిళా న్యాయవాదిపై అమానుష దాడి

Webdunia
ఆదివారం, 15 మే 2022 (15:54 IST)
ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళా న్యాయవాదిపై అమానుషం దాడి  జరిగింది. కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌‌లో ఈ దాడి శనివారం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని మహంతేష్‌గా గుర్తించారు. అలాగే, కత్తిపోట్లకు గురైన మహిళా న్యాయవాదిని సంగీత షిక్కేరిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్‌కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహంతేశ్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ బాగల్‌కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీత తెలిపింది. 
 
ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది. అయితే, మహంతేశ్ మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. తాను ఎవరో చెబితే దాడి చేయలేదని అన్నాడు. ఇటు బీజేపీ నేత రాజు నాయకర్ కూడా సంగీత ఆరోపణలను తోసి పుచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments