Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై మహిళా న్యాయవాదిపై అమానుష దాడి

Webdunia
ఆదివారం, 15 మే 2022 (15:54 IST)
ఆస్తి తగాదాల కారణంగా ఓ మహిళా న్యాయవాదిపై అమానుషం దాడి  జరిగింది. కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌‌లో ఈ దాడి శనివారం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని మహంతేష్‌గా గుర్తించారు. అలాగే, కత్తిపోట్లకు గురైన మహిళా న్యాయవాదిని సంగీత షిక్కేరిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్‌కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహంతేశ్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ బాగల్‌కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీత తెలిపింది. 
 
ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది. అయితే, మహంతేశ్ మాత్రం ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. తాను ఎవరో చెబితే దాడి చేయలేదని అన్నాడు. ఇటు బీజేపీ నేత రాజు నాయకర్ కూడా సంగీత ఆరోపణలను తోసి పుచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments