Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ విప్, తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైకుంఠం ద్వారం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో  చెవిరెడ్డి చేత అదనపు ఈఓ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం శ్రీవారిని దర్శించుకున్న చెవిరెడ్డి రంగనాయక మండపానికి చేరుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు శక్తి వంచన లేకుండా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీ వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం మరోమారు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments