Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబేడు మార్కెట్ ఎఫెక్టు : గ్రీన్ జోను సూళ్లూరుపేటలో 5 కేసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచింది. ఫలితంగా తమిళనాడులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేనా.. తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్ అని తేలింది. ముఖ్యంగా, చెన్నై మహానగరం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోనుగా ఉన్న సూళ్లూరు పేటలో కూడా ఐదు కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్టేనని తేలింది. ఈ వైరస్ సోకినవారంతా కూరగాయల చిరు వ్యాపారులే కావడం గమనార్హం. 
 
లాక్‌డౌన్ వేళ సూళ్ళూరు పేటలోని సాయినగర్, వనంతోపు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో విక్రయించారు. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments