Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యంతర బెయిలుపై జైలు నుంచి విడుదలైన చంత్రబాబు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (16:25 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 52 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. 
 
మరోవైపు, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సెక్షన్ 144 విధించారు. టీడీపీ శ్రేణులు జైలు వద్దకు రాకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. 
 
ఒక దశలో పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుంటూ వారు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్ద ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, లోకేశ్ కుమారుడు దేవాన్ష్ జైలు వద్దకు చేరుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి మరికాసేపట్లో రాజమండ్రికి చేరుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments