వివేకా హత్య కేసు : సీబీఐ అధికారి, వివేకా కుమార్తె అల్లుడిపై కేసు - చార్జిషీటు కూడా...

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:28 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా ఏకైక కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ ఎస్పీ రాం సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని, సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు తనను బెదిరించారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పులివెందుల కోర్టులో ఓ ప్రైవేటు కేసు నమోదైంది. ఈ అంశంలో కేసు నమోదు చేయాలంటూ తాజాగా కోర్టు ఆదేశించింది. దీంతో ఆ ముగ్గురిపై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివేకా హత్య కేసులో వైకాపా నేతల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనపై ఒత్తిడి చేశారని, విచారణ సందర్బంగా సీబీఐ క్యాంపు కార్యాలయంలో తన బిడ్డల ఎదుటే తీవ్రంగా కొట్టారంటూ కృష్ణారెడ్డి అప్పట్లో పులివెందల కోర్టులో ఓ ప్రైవేటు కేసు పెట్టారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంటికి వెళ్లినపుడు, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పులివెందుల న్యాయస్థానం కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే పులివెందుల అర్బన్ పోటీలుసు రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి, తాజాగా చార్జిషీటును కూడా దాఖలు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments