Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇస్రో....

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:45 IST)
భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పించింది. ఈ ఛాన్స్ కేవలం 10వేల మందికి మాత్రమే లభించనుంది. ఇవాల్టి నుండి ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి అందించనుంది.
 
మామూలుగా రాకెట్‌ను ఆకాశంలోకి పంపే ప్రక్రియను మనం కేవలం టీవీలలో వీక్షించి ఉంటాం. ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేం. అలా ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోరికను ఇస్రో నెరవేరుస్తోంది. ఏకంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పించింది.
 
ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగం ఈనెల 15వ తేదీన జరగనుంది. ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు GSLV-మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు 10 వేల మంది సామాన్యులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఇవాళ అర్థరాత్రి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
 
చంద్రయాన్-2 ప్రయోగాన్ని లైవ్‌లో చూడాలనుకునేవారు ఇస్రో వెబ్‌సైట్ WWW.ISRO.GOV.INలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తామని ఇస్రో సంస్థకు చెందిన ప్రతినిధులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments