Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి వెళ్లాలి అనుమతివ్వండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

Webdunia
ఆదివారం, 24 మే 2020 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివుందని, అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించండంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలించాయి. దీంతో ఏపీకి వెళ్లేందుకు తనకు అనుమతించాలని చంద్రబాబు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని పెండింగ్‌లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్‌లైనులో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు.
 
తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు. విశాఖలో బాధితులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments