Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపికి దగ్గరయ్యేందుకేనా బాబు ఆరాటం..?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (15:05 IST)
అమరావతి సభలో అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికనై కనిపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మీటింగ్ లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. పార్టీలకతీతంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అమరావతి రైతుల కోసం చివరి వరకు ఎవరు వస్తారోనన్న ఉత్కంఠ కూడా కనిపించింది.

 
అయితే నిన్న సాయంత్రం జరిగిన సభలో చంద్రబాబు బిజెపి నేతలపైన ప్రత్యేక శ్రద్థ చూపించారు. బిజెపి రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు బిజెపి ముఖ్య నేతలందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. సభకు సంఘీభావం తెలుపుదామని.. అందరూ సభాస్థలిపైనే లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు.

 
అయితే బిజెపి నేతలను పక్కకు తోసేసి మిగిలిన పార్టీల నేతలు ముందుకు వచ్చేశారు. దీంతో గమనించిన చంద్రబాబు బిజెపి వారు కనిపించలేదే. వారిని తోసేస్తున్నారు. జరగండి.. జరగండి అంటూ అందరినీ వెనక్కి పంపించి బిజెపి నేతలను ముందుకు పంపారు. 

 
దీంతో చంద్రబాబు బిజెపితో దోస్తీ కోసం పాకులాడుతున్నట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న జమిలీ ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితేనే ఉపయోగం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. దీంతో ఇప్పటి నుంచే బిజెపికి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments