Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కుప్పంకు చంద్రబాబు.. మూడు రోజుల అక్కడే మకాం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:29 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పం వెళుతున్నారు. అక్కడ ఆయన మూడు రోజుల పాటు మకాం వేస్తారు. ఈ సమయంలో పార్టీ నేతలు, బూత్ ఇన్‌చార్జిల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తారు. అలాగే, కుప్పంలో కొత్తగా నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. 
 
ప్రధానంగా అధికార పార్టీ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి ఒకే ఓటరుకు మూడు చోట్ల ఓటు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండేలా వారికి పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 
 
అంతేకాకుండా కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్‌కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించి, పార్టీ నేతలు సమాలోచనలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం ఆయన అన్ని క్లస్టర్లలోని 50 మంది ప్రధాన నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. 
 
అదేవిధంగా కుప్పం - పలమనేరు హైవే పక్కన నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. నియోజకవర్గ పరిస్థితిని వ్యక్తిగతంగా తానే పర్యవేక్షిస్తానని... ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. చెప్పిన విధంగానే గత 8 నెలల్లో ఆయన కుప్పంకు వెళ్తుండటం ఇది మూడో సారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments