Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులైతే.. పర్లేదు: చంద్రబాబు సెటైర్లు

బీజేపీ పెద్దల మాట మనం వినమని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చునని ఏపీ చంద్రబాబు నాయుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్లు

Webdunia
మంగళవారం, 1 మే 2018 (06:20 IST)
బీజేపీ పెద్దల మాట మనం వినమని..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తులనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చునని ఏపీ చంద్రబాబు నాయుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సెటైర్లు విసిరారు. తిరుపతిలో ధర్మ పోరాట సభలో మాట్లాడుతూ.. తమకు పదవులు ముఖ్యం కాదని, తాము వాటి కోసం ఎప్పుడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరూ అడగక ముందే ఏక పక్షంగా కొందరు మద్దతు ఇస్తామని చెప్పారని.. ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మనం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే, పోరాడుతోన్న వారిపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఓ వైపు తాను ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తుంటే మరోవైపు వైకాపా నేతలు 'నయవంచన' పేరిట మీటింగులు పెడుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకన్న ఆశీస్సులతో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని బాబు అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments