బాబు ఇంటిపై దాడి కేసు : వైకాపా నేతలకు చుక్కెదురు.. నందిగం సురేష్ పరారీ!!

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (18:48 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో వైకాపా నేతలకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ను వైకాపా నేతలకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైకాపా నేతలు ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 
 
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై ఇవాళ బుధవారం హైకోర్టు నిర్ణయం వెలువరించింది. వైకాపా నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికేసులో జోగి రమేశ్‌ నిందితుడిగా ఉన్నారు.
 
మరోవైపు, హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో వైకాపా నేతల అరెస్టుకు రంగం సిద్ధమైంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్టు ముందుగానే తెలుసుకున్న సురేష్ ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments