Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వేలికి రింగ్.. ఆ రింగ్‌లో ఉన్న రహస్యమేంటి?

Webdunia
గురువారం, 7 జులై 2022 (17:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూపుడు వేలికి ప్లాటినం రింగ్ వచ్చి చేరింది. ఈ రింగులోని రహస్యాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లిలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా ఈ ప్లాటినం ఉంగరం వెలుగుచూసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనడంతో సమావేశం తర్వాత జరిగిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో ఈ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు. 
 
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా పెట్టుకున్న నిజమేనని, ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉంటుందని, అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం, తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని తెలిపారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికపుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా ఆయన వెల్లడించారు. 
 
రోజూ నిద్రలేచిన తర్వాత కంప్యూటర్‌కు పంపిన రిపోర్టును చెక్ చేసుకుంటానని, అందులో రోజువారీగా చేయాల్సిన చర్యల్లో ఏదేని తప్పులు దొర్లివున్నట్టయితే దాన్ని సరిదిద్దుకుని, మరుసటి రోజు ఆ తప్పు జరుగకుండా చూస్తానని చెప్పారు. అలాగే, పార్టీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments