Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వేలికి రింగ్.. ఆ రింగ్‌లో ఉన్న రహస్యమేంటి?

Webdunia
గురువారం, 7 జులై 2022 (17:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూపుడు వేలికి ప్లాటినం రింగ్ వచ్చి చేరింది. ఈ రింగులోని రహస్యాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లిలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా ఈ ప్లాటినం ఉంగరం వెలుగుచూసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనడంతో సమావేశం తర్వాత జరిగిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో ఈ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు. 
 
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా పెట్టుకున్న నిజమేనని, ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉంటుందని, అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం, తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని తెలిపారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికపుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా ఆయన వెల్లడించారు. 
 
రోజూ నిద్రలేచిన తర్వాత కంప్యూటర్‌కు పంపిన రిపోర్టును చెక్ చేసుకుంటానని, అందులో రోజువారీగా చేయాల్సిన చర్యల్లో ఏదేని తప్పులు దొర్లివున్నట్టయితే దాన్ని సరిదిద్దుకుని, మరుసటి రోజు ఆ తప్పు జరుగకుండా చూస్తానని చెప్పారు. అలాగే, పార్టీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments