Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు ఆస్పత్రిలో శవాలను పీక్కుతింటున్న కుక్క!!?? (Video)

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయే రోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోనే ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా రోగులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒకవేళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయే కరోనా రోగుల మృతదేహాలను తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ హృదయ విదాకర సంఘటనకు సంబంధించి ఓ వీడియోను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఒంగోలు ఆస్పత్రిలో ఓ బెడ్ కింద రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని... రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 
 
శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని పేర్కొన్నారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకోవడంతో రోజుకు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments