Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు కు అవమానం..మండిపడుతున్న తమ్ముళ్లు..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (11:00 IST)
ఏపీ మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘోర  అవమానం జరిగింది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది చంద్రబాబును తనిఖీ చేశారు. 
 
చంద్రబాబు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో  ఆయన వాహనం వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయినా సరే ఆయన వాహనాన్ని కూడా విమానాశ్రయం లోనికి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు చంద్రబాబునాయుడు కూడా సాధారణ ప్రయాణికుడిలా బస్సులోనే వెళ్లారు. అయితే ఈ తనికీలపై  టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఇటువంటి చర్యలు  చేపడుతున్నారన్న  అభిప్రాయం వ్యక్తం చేస్తన్నాయి. 
 
ప్రతి పక్ష నేతగా ఉన్న సమయంలో ఈ తరహా తనికీలు గతంలో చేయలేదని, మాజీ ముఖ్యమంత్రి  హోదాలో  జెడ్ కేటగిరీ రక్షణ ఉన్న నేతకు ఇటు వంటి తనికీలు ఉండవన్నది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు.


ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌లో పైలెట్‌ వాహనం తొలగించడం, ట్రాఫిక్ సర్కిల్  క్లియరెన్స్‌ చేయకపోవడం  వెనుకు రాజకీయ కారణలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాజా పరిణామాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు కొందరు నేతలు.చంద్రబాబు  మరి కొంత కాలం  వేచి చూసి అప్పుడు స్పందిద్దాం అన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments