Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు కంటి సమస్యలు.. ఆపరేషన్ చేయించుకుంటారా?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (08:44 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆపై డిశ్చార్జ్ అయ్యారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సమస్యలకు చంద్రబాబు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. 
 
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ కే రాజేశ్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తం, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ వంటి పలు పరీక్షలను సూచించింది. చంద్రబాబుకు స్క్రీనింగ్ మొదలైనవి చేశారు. 
 
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. తీవ్రమైన అలర్జీ, ఇతర వైద్యపరమైన కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments