Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (14:26 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రోడ్డు షోలు, బహిరంగ సభల నిర్వహణకు అనువుగా ప్రాంతాలను ఎంపిక చేశాయి. 
 
ఇందుకోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షోలో పాల్గొంటారు. 
 
ఆ తర్వాత కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. గురువారం పట్టణంలో రోడ్డు షో నిర్వహించి, మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్డు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 
 
రాత్రికి కర్నూలులో బస చేసి శుక్రవారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు  పర్యవేక్షించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments