Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను... అన్నయ్య పాదాలు తాకి.. వీడియో

సెల్వి
బుధవారం, 12 జూన్ 2024 (12:30 IST)
ఎట్టకేలకు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడితో పాటు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రజా రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయడంలో కీలకపాత్ర పోషించాలన్న మెగా ఫ్యామిలీ తపనకు తెరపడింది. 
 
కేసరపల్లిలో జరిగిన అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. 
 
అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకటించిన మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగా స్టార్ చిరంజీవి పాదాలను తాకగా, నారా లోకేష్ నాయుడు పాదాలను తాకి, ప్రధాని మోడీ, గవర్నర్, అమిత్ షాల ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
"కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను" అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments