Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ అంబానీతో సహా కేంద్రానికి చంద్రబాబు షాక్... ఆ భూములు ఇచ్చేయండి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చ

Webdunia
సోమవారం, 14 మే 2018 (16:21 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చిన భూములపై ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం భూములను సేకరించింది. ఐతే ఈ ప్రాజెక్టుల్లో పురోగతి లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయిస్తూ నోటీసులు పంపింది. 
 
అంతేకాదు... ఎల్ఐసీ, ఎస్బీఐ తదితర కార్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమిని కూడా తిరిగి తమకు అప్పగించాలంటూ సీఆర్డీయే నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుని అనిల్ అంబానీ కలిసి ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో వున్నదో వెల్లడిస్తారని సమాచారం. మరి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments