Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 సెగ్మెంట్లలో 'తలైవా' ఓటు బ్యాంకు - సర్కారు బెంబేలు...

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ

Webdunia
సోమవారం, 14 మే 2018 (15:11 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ పడుతున్నారు. ఇందుకోసం వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
 
అయితే, తమిళనాడులోని అత్యధిక శాసనసభ నియోజకవర్గాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మంచి ఆకర్షణ ఉన్నట్టు ఓ రహస్య సర్వే తేల్చింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ సర్వేను చూసిన అధికార అన్నాడీఎంకే దీంతో కంగుతిన్న సర్కారు అప్రమత్తమైనట్లు తెలిసింది. 
 
రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేసినప్పటికీ ఇప్పటివరకు పార్టీని మాత్రం రజనీకాంత్‌ ప్రారంభించలేదు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడులో ఆయనకు ప్రజామద్దతు ఎలా ఉందనే విషయాన్ని నిఘావర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య సర్వే చేయించిందని సమాచారం. 
 
రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు ఉందనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు 35 నుంచి 40 శాతం మేరకు ఓటు బ్యాంకు సిద్ధమైందని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 15 శాతం దళితులు, 8 శాతం మైనారిటీలు, 15 శాతం ఇతర సామాజికవర్గం, రాజకీయ అసంతృప్తులు ఉన్నారని ప్రభుత్వానికి అందించిన నివేదికలో నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments