Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్ సునామీ.. ఓటమి దిశగా నారా లోకేశ్

Webdunia
గురువారం, 23 మే 2019 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్యాన్ సునామీ సృష్టించింది. ఆ దెబ్బకు అధికార తెలుగుదేశం అభ్యర్థులు కొట్టుకునిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మంత్రులందరూ ఓటమిని చవిచూడనున్నారు. ఒకానొక దశలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం వెనుకబడి.. ఆ తర్వాత పుంజుకున్నారు.
 
అదేవిధంగా ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్... వైకాపా ఆభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోనున్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 
 
మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎలీజా తొలి విజయం నమోదు చేయగా.. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, కృష్ణా జిల్లా పెడనలో జోగి రమేశ్‌, మచిలీపట్నంలో పేర్ని నాని, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నవాబ్‌ బాషాలు విజయం సాధించారు. 
 
గురువారం వెల్లడవుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఇప్పటివకరు 9 స్థానాల్లో విజయం సాధించగా, మరో 144 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అధికార టీడీపీ మాత్రం 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
ఇదిలావుండగా, చిత్తూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఈ జిల్లాలో వైకాపా తిరుగులేని ప్రభంజనం సృష్టించనుంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మూడో రౌండ్ ముగిసేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందజలో ఉన్నారు. తంబల్లపల్లి వైఎస్సాసీపీ అభ్యర్థి ద్వారాకనాథ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్యవేడు, నగరిలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments