Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నా నాలుగో పెళ్లాం అని పవన్ అనేసరికి పీక్కుంటున్నారు: చంద్రబాబు

ఐవీఆర్
శనివారం, 2 మార్చి 2024 (17:22 IST)
కందుకూరులో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత చెల్లెలికి జగన్ అన్యాయం చేసాడు. ఆమెకివ్వాల్సిన ఆస్తిని ఇవ్వలేదు. జగన్ దెబ్బకి ఆమె వేరే పార్టీలో చేరాల్సి వచ్చింది. అన్న మీద వుండే కోపంతో ఆమె కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తోంది. ఆమె మాటలకు బాధపడటం లేదు సమాధానాలిస్తామన్నారు.
 
ఎన్నికల సమయంలో సోదరితో పాదయాత్రలు చేయించి లబ్ది పొంది అధికారంలోకి రాగానే టిష్యూ పేపరు మాదిరిగా ఆమెను తోసేసారు. ఇపుడు సోషల్ మీడియాలో ఆమెపై నీచమైన ప్రచారం చేయిస్తున్నారు. కనీసం దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఒక అన్నగా చేయాలి కదా. సొంత చెల్లె పుట్టుకపై దారుణమైన ప్రచారాలు జరుగుతుంటే చూస్తూ వూరుకుంటున్నారు, ఇది ఎంత అవమానకరం?
 
మమ్మల్ని కూడా జగన్ ఇష్టమొచ్చినట్లు తిడుతుంటారు. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్నోసార్లు దూషించారు. చివరికి పవన్ కళ్యాణ్ విసిగిపోయారు. నాకు ముగ్గురు పెళ్లాలు నిజమే కానీ నాలుగో పెళ్లాం గురించి తెలియదు. నా నాలుగో పెళ్లా నువ్వేనేమో జగన్ అని మొన్న సభలో అన్నారు. పవన్ మాటతో వైసిపి వాళ్లకు ఏం చేయాలో తెలియక పీక్కుంటున్నారంటూ చెప్పారు చంద్రబాబు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments