Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేస్తే పన్ను బాదేయండి : మోడీకి బాబు సూచన

బ్యాంకు ఖాతాల నుంచి రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేసే వారిపై భారీ మొత్తంలో పన్ను బాదాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కమిటీ సూచన చేసింది.

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (09:06 IST)
బ్యాంకు ఖాతాల నుంచి రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేసే వారిపై భారీ మొత్తంలో పన్ను బాదాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కమిటీ సూచన చేసింది. ఈ పన్ను బాదుడుకు క్యాష్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీ అని పేరు పెట్టింది. డిజిటల్‌ లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న అన్నిరకాల మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటులు రద్దు చేసి, ఇకమీదట అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్‌ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు. 
 
అలాగే, ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్‌ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులపై పాత తేదీలతో పన్నులు వేయవద్దని సూచించింది. సంవత్సర ఆదాయంలో ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్‌ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్‌ రైళ్లలో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించాలని కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments